Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలను ఓకే చేస్తూ షూటింగ్లను కూడా వేగంగా పూర్తి చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. ఇటీవలే ఈయన నటించిన ”భీమ్లానాయక్’ బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను సాధించింది. ప్రస్తుతం ఈయన క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీర మల్లు’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే 60 శాతం షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రాన్నిఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. దీంతో పాటుగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్తో కలిసి ‘వినోదయ సిత్తం’ రీమేక్లో నటించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ ప్రారంభించనుంది. వీటితో పాటుగా పవన్ మరో 2 సినిమాలను లైన్లో పెట్టాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈయన మరో యువ దర్శకుడితో సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.
టాలీవుడ్ యువ దర్శకుడు వేణు ఊడుగుల దర్శకత్వంలో పవన్ సినిమాను చేయ్యబోతున్నట్లు తెలుస్తుంది. శ్రీ విష్ణు హీరోగా నటించిన ‘నీది నాది ఒకే కథ’ సినిమాతో వేణు ఊడుగుల మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కమర్షియల్గా ఈ చిత్రం సక్సెస్ కాకపోయినా క్రిటిక్స్ నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఈయన దర్శకత్వం వహించిన ‘విరాటపర్వం’ విడుదలకు సిద్ధంగా ఉంది. రానా, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం తెలంగాణలోని నక్సలైట్ల నేపథ్యంలో తెరకెక్కింది. ఇదిలా ఉంటే ఇటీవలే వేణు, పవన్ను కలిసి ఒక కథను వినిపించాడట. కథ బాగా నచ్చడంతో పవన్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. త్వరలోనే ఈప్రాజెక్ట్ పై అఫీషియల్గా అనౌన్స్మెంట్ రానుందని టాక్.
Read Also:
Ghani | భారీ ధర పలికిన ‘గని’ నాన్-థియేట్రికల్ హక్కులు?
Kriti Shetty | భారీగా పారితోషికాన్ని పెంచేసిన కృతిశెట్టి.. సూర్యతో సినిమాకు అన్ని కోట్లు తీసుకుందా?
Surya ‘ET’ | ఓటీటీలోకి సూర్య ‘ఈటీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Radhe Shyam | ప్రభాస్ ‘రాధేశ్యామ్’ ఫైనల్ కలెక్షన్స్