Republic | సెప్టెంబర్ 10న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయి ధరమ్ తేజ్ గత 10 రోజులుగా అపోలో హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాడు. ఈయన ఎలా ఉన్నాడు అనే వీడియో ఇప్పటివరకు బయటికి రాలేదు. కానీ సాయికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెబుతున్నారు. అలాగే కుటుంబ సభ్యులు కూడా సాయి ధరమ్ తేజ్ క్రమంగా కోలుకుంటున్నాడని తెలిపారు. ఇదిలా ఉంటే సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి.
హీరో లేకుండానే ప్రమోషన్ మొదలుపెట్టారు రిపబ్లిక్ సినిమా దర్శకనిర్మాతలు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 25న జరగనుంది. తన మేనల్లుడి కోసం పవన్ కళ్యాణ్ ( Pawan kalyan ) ఈ ఈవెంట్కు వస్తున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం కూడా వచ్చింది. పోస్టర్ కూడా విడుదల చేశారు మేకర్స్. హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో ఈ వేడుక జరుగనుంది. దీనికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా వస్తున్నాడు. సాయి ధరమ్ తేజ్ హాస్పిటల్లో ఉన్న ఈ సమయంలో జరుగుతున్న ఈవెంట్ కావడంతో అభిమానులు కూడా చాలా ఎమోషనల్ అవుతున్నారు. పవన్ ఈ వేడుకలో ఏం మాట్లాడతాడు అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దేవా కట్టా తెరకెక్కించిన ఈ సినిమా పూర్తిగా సోషల్ మెసేజ్తో వస్తుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
రిపబ్లిక్ ప్రమోషన్స్కు సాయి ధరమ్ తేజ్ అలాగే రానున్నాడా..?
Lahari: దండలు మార్చుకొని పెళ్లి చేసుకున్న శ్రీరామ్- లహరి
Ntr: కారు నెంబర్ కోసం తారక్ అంత ఖర్చు పెట్టాడా..!
Sidharth Malhotra: కియారాతో సిద్ధార్థ్ ప్రేమాయణం.. పెళ్లిపై నోరు విప్పిన యువ హీరో
Samantha: సమంతకు భరణంగా అన్ని కోట్లు ఇస్తున్నారా..?