టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం (AM Ratnam), స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ క్రేజీ కాంబినేషన్ ప్రేక్షకులకు ఖుషీ లాంటి ఆల్ టైమ్ సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ అందించింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో బంగారం కూడా సినిమా వచ్చింది. ఇపుడు హరిహరవీరమల్లు (Hari Hara Veera Mallu)సినిమాతో హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. కాగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చిన ఈ చిత్రం కొంతకాలంగా షూటింగ్ జరుపుకుంటోంది.
అయితే ఆర్థికపరమైన, రాజకీయ కారణాలతో ఈ సినిమా ఆలస్యమవుతుందని చర్చించుకుంటూ డైలమాలో ఉన్న పవన్ కల్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఈ ప్రాజెక్టుపై భారీ బడ్జెట్ పెట్టిన ఏఎం రత్నంకు సినిమా ఆలస్యం కాకుండా..త్వరగా పూర్తి చేస్తానని పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చాడట. ఏఎం రత్నంను బడ్జెట్ భారం నుంచి గట్టెక్కించేందుకు వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేస్తానని పవన్ హామీనిచ్చినట్టు టాలీవుడ్ సర్కిల్ టాక్.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోవైపు ఏపీలో పొలిటికల్ (AP Politics)టూర్ ప్లాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అక్టోబర్ నుంచి బస్సు యాత్ర చేపట్టి..ఏపీ అంతటా పర్యటించేలా ప్రణాళికలు వేసుకున్నారు. జనసేన టూర్ ప్లాన్కు తక్కువ సమయమే ఉంది. హరిహరవీరమల్లుతోపాటు పవన్ కల్యాణ్ ఇప్పటికే మరో రెండు సినిమాలు లైన్లో పెట్టారు. మరి పాలిటిక్స్ తో బిజీ కానున్న పవన్ కల్యాణ్ డెడ్లైన్ లోపు సినిమాలు పూర్తి చేస్తాడా..? అనేది చూడాలంటున్నారు సినీ జనాలు.
Read Also : Pooja Hegde | కరణ్ జోహార్ టీంతో జాయిన్ అయిన పూజాహెగ్డే..వీడియో
Read Also : DJ Tillu Sequel | సీక్వెల్తో వచ్చేస్తున్న డీజే టిల్లు..ఆ ఫ్లేవర్ రిపీట్ అయ్యేనా..?
Read Also : Shahrukh Khan | రామోజీఫిలింసిటీలో షారుక్ ఖాన్..జోష్లో అభిమానులు
Read Also : Rangamarthanda | కృష్ణవంశీ నుంచి ‘రంగమార్తాండ’ తాజా అప్డేట్