2018లో వచ్చిన జీరో చిత్రం బాక్సాపీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. దీంతో మూడేళ్లకుపైగా విరామం తీసుకున్న షారుక్ ఖాన్ (Shahrukh Khan) మళ్లీ అభిమానులకు మంచి హిట్టు ఇచ్చేందుకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ స్టార్ హీరో ప్రస్తుతం షారుక్ మూడు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. కాగా వీటిలో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఆట్లీ (Atlee)తో చేస్తున్న సినిమా ఒకటి. జవాన్ (Jawan) టైటిల్తో వస్తున్న ఈ సినిమాపై క్రేజీ అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది. లేటెస్ట్ న్యూస్ ప్రకారం షారుక్ ఖాన్ ప్రస్తుతం రామోజీఫిలిం సిటీలో ఉన్నాడట.
రామోజీఫిలిం సిటీలో కొత్త షెడ్యూల్ షురూ అయినట్టు సమాచారం. షారుక్పై వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తుందట ఆట్లీ అండ్ టీం. హై యాక్షన్ జోనర్ లో రాబోతున్న జవాన్ కోసం రామోజీ ఫిలింసిటీ (RFC) లో భారీ సెట్స్ వేశారని ఇన్ సైడ్ టాక్. ఇక లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఇటీవలే విఘ్నేశ్ శివన్-నయనతార వివాహానికి షారుక్ ఖాన్ హాజరైన విషయం తెలిసిందే. మరి నయనతార షూటింగ్లో ఎప్పుడు జాయిన్ అవుతుందనేది తెలియాల్సి ఉంది.
మరోవైపు షారుక్ ఖాన్ సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్లో పఠాన్ సినిమా చేస్తున్నాడు. దీపికా పదుకొనే, జాన్ అబ్రహాం కీ రోల్స్ చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. దీంతోపాటు మల్టీ స్టారర్ ప్రాజెక్టు బ్రహ్మాస్త్రలో శాస్త్రవేత్తగా కనిపించబోతున్నాడని సమాచారం.
Read Also : Chiranjeevi | సెకండాఫ్ మార్చాలని అభిమానికి చిరంజీవి సూచన..?
Read Also : Rangamarthanda | కృష్ణవంశీ నుంచి ‘రంగమార్తాండ’ తాజా అప్డేట్
Read Also : Directors Bullet Song | బుల్లెట్ సాంగ్కు స్టార్ డైరెక్లర్లు డ్యాన్స్ చేస్తే..వీడియో హల్చల్