మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మెహర్ రమేశ్, మోహన్ రాజా, బాబీ డైరెక్షన్లో సినిమాలకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు చిరు. మరోవైపు తన వీరాభిమాని అయిన వెంకీ కుడుముల (Venky Kudumula)తో ఓ సినిమా చేస్తానని ఎవరూ ఊహించని ప్రకటన చేసి..టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచాడు చిరంజీవి. ఇపుడీ ప్రాజెక్టుకు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ఇంతకీ విషయమేంటంటే ఇటీవలే సినిమా కథను విన్న చిరు కొన్ని మార్పులు చేయాలని సూచించాడట. తాజా అప్డేట్ ప్రకారం మొదటగా రాసి సెకండాఫ్ అంత బాగా లేదని, అందుకే సెకండాఫ్ మొత్తాన్ని మార్చాలని సూచించినట్టు టాక్ నడుస్తోంది. రీసెంట్గా వచ్చిన ఆచార్య బాక్సాపీస్ వద్ద ఫెయిల్యూర్గా నిలిచి..ప్రేక్షకులు, అభిమానులను ఇంప్రెస్ చేయలేకపోవడంతో చిరు ఆలోచనా విధానం మారిందట.
ఓటీటీ ప్రాజెక్టుల వాహ నడుస్తున్న ఇలాంటి పరిస్థితులలో కంటెంట్ సూపర్ క్రియేటివ్గా లేకపోయినా, రక్తి కట్టించే ఇంట్రెస్టింగ్ సీన్లతో స్క్రీన్ ప్లే లేకున్నా ఆడియెన్స్ అంగీకరించడం లేదని..ఈ కోణంలో కంటెంట్ను రెడీ చేయడంపై మరింత ఫోకస్ పెట్టాలని వెంకీకి చిరు సూచించినట్టు ఇన్సైడ్ టాక్. ఈ క్రేజీ న్యూస్పై వెంకీ కానీ, చిరు కానీ ఏమైనా స్పందిస్తే క్లారిటీ వచ్చే అవకాశముంది.
ప్రస్తుతం గాడ్ ఫాదర్ (God Father) శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నాఉ. మరోవైపు మెహర్ రమేశ్ డైరెక్షన్లో చేస్తున్న భోళా శంకర్ కూడా సెట్స్ పైకి ఉంది. మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న బాబీ-చిరు ప్రాజెక్టుపై షూటింగ్ అప్ డేట్ రావాల్సి ఉంది.
Read Also : Rangamarthanda | కృష్ణవంశీ నుంచి ‘రంగమార్తాండ’ తాజా అప్డేట్
Read Also : Directors Bullet Song | బుల్లెట్ సాంగ్కు స్టార్ డైరెక్లర్లు డ్యాన్స్ చేస్తే..వీడియో హల్చల్
Read Also : Vijay Sam | లిటిల్ ఖుషీతో విజయ్-సమంత..ట్రెండింగ్లో స్టిల్