Pankaj Tripathi | ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి (Pankaj Tripathi) ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి పండిట్ బనారస్ తివారి (Pandit Banaras Tiwari) కన్నుమూశారు. ఆయన వయసు ప్రస్తుతం 99. వృద్ధాప్య కారణాలతో మరణించినట్లు తెలుస్తోంది. తివారి ప్రస్తుతం బీహార్ (Bihar) రాష్ట్రం గోపాల్గంజ్ (Gopalganj)లోని ఓ గ్రామంలో నివాసం ఉంటున్నారు. అక్కడే ఆయన తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని త్రిపాఠి కుటుంబ సభ్యులు వెల్లడించారు. తివారి అంత్యక్రియలు సోమవారం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తండ్రి మరణవార్త తెలుసుకున్న పంకజ్ త్రిపాఠి ముంబై నుంచి హుటాహుటిన తన గ్రామానికి బయలుదేరి వెళ్లారు.
కాగా, ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పంకజ్ త్రిపాఠి తన తండ్రి గురించి ప్రస్తావించారు. తాను ఓ డాక్టర్ కావాలని తన తండ్రి కోరుకున్నట్లు వెల్లడించారు. ‘నేను ఉత్తర బీహార్లోని గోపాల్గంజ్లో గల ఓ గ్రామం నుంచి వచ్చాను. నేను ఓ రైతు కొడుకుని. నేను డాక్టర్ కావాలని మా నాన్నగారు కోరుకున్నారు. నటన (Acting) గురించి నా తండ్రికి పెద్దగా అవగాహన లేదు. అందుకే నా విజయాల గురించి పెద్దగా గర్వపడరు. నేను సినిమాల్లో ఏం చేస్తానో, ఎలా చేస్తానో కూడా మా నాన్నకు తెలియదు. ఇప్పటి వరకు సినిమా థియేటర్ లోపలి నుంచి ఎలా ఉంటుందో కూడా ఆయన చూడలేదు’ అని పంకజ్ త్రిపాఠి వివరించారు.
మీర్జాపూర్ సిరీస్తో చాలా మందికి దగ్గరైన పంకజ్ త్రిపాఠి ఇటీవలే బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar) నటించిన ఓ మై గాడ్ – 2 (OMG 2) చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించారు. అమిత్ రాయ్ (Amit Roy) దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Also Read..
Tapkeshwar Temple | భారీ వర్షాలకు కూలిన ప్రసిద్ధ ఆలయం.. వీడియో
Sonia Gandhi | రాజీవ్ గాంధీ రాజకీయ జీవితం అత్యంత దారుణంగా ముగిసింది.. కానీ, : సోనియా గాంధీ
Samantha | ఈ క్షణాలు జీవితాంతం గుర్తుంటాయి.. ఇండియా డే పరేడ్లో సమంత..