2003లో పవన్ కల్యాణ్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన జానీ చిత్రంలో చివరి సారిగా హీరోయిన్గా సిల్వర్ స్క్రీన్ పై మెరిసింది రేణూదేశాయ్ (Renu Desai). దాదాపు 20 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత రేణూ దేశాయ్ మళ్లీ గ్రాండ్ రీ ఎంట్రీకి సిద్దమవుతుంది. మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వబోతుంది రేణూ. అయితే రేణూ దేశాయ్ యాక్టింగ్ కెరీర్, డైరెక్టింగ్ను పలు విధాలుగా ప్లాన్ చేసుకోగా…అవేవి అనుకున్న ప్రకారం జరుగలేదట.
ఇంతకీ ఆ ప్లాన్స్ అన్నీ అటకెక్కడానికి కారణమేమై ఉంటుందని అనుకుంటున్నారా..? ఒక ఎఫెక్ట్ రేణూ ప్లాన్స్ అన్నింటినీ కింద మీద చేసేసిందట. అదేంటో కాదు..కరోనా సంక్షోభం (Pandemic Changes). రైతుల కథ నేపథ్యంలో తెలుగులో సినిమా డైరెక్ట్ చేయాలని ప్లాన్ చేసిన రేణూ స్క్రిప్ట్ సిద్దం చేసి గతంలోనే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టింది. అయితే కరోనా పంజా విసరడంతో ఆ సినిమాకు బ్రేక్ పడ్డది. గతంలో చేసుకున్న ఇతర ప్లాన్స్ డైలామాలో పడ్డాయట.
ఇక ప్రస్తుతం రవితేజ నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి టైగర్ నాగేశ్వర్ రావు (Tiger Nageshwara Rao). ఈ ఏడాది తర్వాత సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశముందని టాలీవుడ్ సర్కిల్ టాక్. రేణూ దేశాయ్ తో మేకర్స్ చర్చలు జరుపగా సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని లేటెస్ట్ టాక్. ఈ చిత్రంలో రవితేజ సోదరిగా కనిపించనుందని ఇన్ సైడ్ టాక్. అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. టైగర్ నాగేశ్వర్ రావు వివిధ భాషల్లో విడుదల కానుంది. రవితేజ తొలి పాన్ ఇండియాప్రాజెక్టు ఇదే కావడం విశేషం.