మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. చాలా వరకు తన పోస్ట్లు ఆసక్తి రేకెత్తించే విధంగా ఉంటాయి. సమాజం కోసం, సమాజ హితం కోసం రేణూ పాటుపడుతూ ఉంటుంది. కరోనా సమయంలో రేణూ చాలా మందికి తనకు తోచినంత సాయం చేసింది.
అయితే రేణు దేశాయ్ తాజాగా తన సోషల్ మీడియాలో జంతు పరిరక్షణకు సంబంధించి ఓ సంస్థ చేసిన పోస్ట్ను షేర్ చేస్తూ.. తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. తాను శాఖాహారిగా మారిందని చెబుతూ..ఓ జంతువు జీవితకాలం మొత్తం భయం, బాధ, నొప్పితో బాధపడుతుంటుంది.15 నిమిషాల ఆనందం,సుఖం కోసం ఇది సరికాదు అని తెలుసుకున్నాను.
ఈ విషయంలో రియలైజ్ అయ్యాను అంటూ పోస్ట్ సారాంశాన్ని రేణూ దేశాయ్ చెప్పుకొచ్చింది. రేణూ దేశాయ్ పోస్ట్ ప్రస్తుతం వైరల్ కావడమే కాకుండా నలుగురిని ఆలోజింపజేస్తుంది. సినిమాలకు దూరమైన తర్వాత రేణూ దేశాయ్ దర్శకురాలిగా సత్తా చాటే ప్రయత్నం చేస్తుంది. అప్పుడప్పుడు పలు టీవీ షోలలో జడ్జిగా కనిపించి సందడి చేస్తుంది.