బాలీవుడ్ చిత్రం ‘ఓం శాంతి ఓం’తో గుర్తింపు తెచ్చుకున్న నటుడు నితీష్ పాండే మంగళవారం నాసిక్లో గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 50 సంవత్సరాలు. ప్రముఖ వార్తా సంస్థ నివేదిక ప్రకారం మంగళవారం మహారాష్ట్ర నాసిక్లోని ఇగత్పురికి చెందిన హోటల్లో నితీష్ అపస్మారకంగా కనిపించాడు.
ప్రాథమికంగా ఆయన మరణానికి కారణం గుండెపోటు అని నిర్ధారించిన పోలీస్ బృందం హోటల్లో దర్యాప్తు మొదలుపెట్టింది. హోటల్ సిబ్బందితో పాటు అతని సన్నిహిత వ్యక్తులను కూడా ప్రశ్నిస్తున్నారు.