Nithya Menon | టాలీవుడ్ నటి నిత్యామీనన్ .. టీచర్ అవతారం ఎత్తింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు చెప్తూ కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోను నటి ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసింది.
ప్రస్తుతం నిత్యామీనన్ ఓ మలయాళ చిత్రంలో నటిస్తోంది. చిత్ర షూటింగ్ నిమిత్తం తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణాపురం అనే గ్రామానికి వెళ్లిన ఆమె.. షూటింగ్ బ్రేక్లో దగ్గర్లోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించింది. అక్కడ విద్యార్థులు, ఉపాధ్యాయులతో కాసేపు సరదాగా ముచ్చటించింది. అనంతరం పిల్లలకు ఇంగ్లీష్లో పాఠం చెప్పింది. విద్యార్థులకు అర్థమయ్యేలా తెలుగులోనూ వాటిని వివరించింది.
వీడియో పోస్టు చేసిన నటి ‘కృష్ణాపురం గ్రామంలోని ఈ చిన్నారులతో కొత్త ఏడాదిలో మొదటిరోజు ఇలా గడిచిపోయింది..’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.