టాలీవుడ్ (Tollywood) హీరో నితిన్ (Nithiin) త్వరలో మాచెర్ల నియోజకవర్గం (Macherla Niyojakavargam) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. డెబ్యూ డైరెక్టర్ ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి (MS Raja Shekhar Reddy) డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రం ఆగస్టు 12న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ ప్లాన్ రెడీ చేసుకుంది నితిన్ టీం. కాగా నితిన్కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది.
ఇప్పటివరకు సిల్వర్ స్క్రీన్పై మెరిసిన నితిన్ టీవీ స్క్రీన్పై మెరువబోతున్నాడు. నితిన్ త్వరలోనే సీరియల్స్లో నటించబోతున్నాడన్న వార్త హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఈ కొత్త డెసిషన్ ఏంటీ అనుకుంటున్నారా..?. సినిమా ప్రమోషన్స్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నాడట. తాజా అప్ డేట్ ప్రకారం పలు పాపులర్ టీవీ సీరియల్స్లో నితిన్ అతిథి పాత్రలో కనిపించి.. మాచెర్ల నియోజకవర్గం ప్రమోట్ చేయనున్నాడని ఇన్సైడ్ టాక్.
ఈ మూవీలో కృతిశెట్టి (Krithi Shetty), కేథరిన్ థ్రెసా (Catherine Tresa) హీరోయిన్లుగా నటిస్తున్నారు. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నిహోం బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. రాజ్కుమార్ ఆకెళ్ల మాచెర్ల నియోజకవర్గం ప్రాజెక్టును సమర్పిస్తున్నారు. ఈ సినిమాలో అంజలి స్పెషల్ సాంగ్లో మెరువనుంది.