నిఖిల్ (Nikhil Siddharth),అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం కార్తికేయ (Karthikeya 2). చందూ మొండేటి (Chandoo Mondeti) డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రంలో ఫీ శ్రీనివాస్ రెడ్డి, హర్ష చెముడు కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే నిఖిల్ టీం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. నిఖిల్ ఈ సారి సరికొత్త ట్రెండ్కు శ్రీకారం చుడుతూ తన సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నాడు.
ప్రమోషన్ కోసం జీ తెలుగులో ప్రసారమయ్య పాపులర్ డైలీ సీరియల్ రాధమ్మ కూతురు ఎపిసోడ్లో ప్రత్యక్షమయ్యాడు నిఖిల్. ప్రపంచంలో ప్రతీది ప్రతీ ఒక్కరితో..ప్రతీది ఇంటర్లింక్డే అనే డైలాగ్ తో విలన్కు పంచ్ విసురుతున్నాడు నిఖిల్. ఈ వీడియోను ట్విటర్ లో షేర్ చేయగా..నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. ఇటీవలే ప్రపంచ ప్రఖ్యాత యూపీలోని ISKCON ఆర్గనైజేషన్ను సందర్శించింది నిఖిల్ టీం.
థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ దర్శకనిర్మాత అనుపమ్ఖేర్, ఆదిత్యా మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కార్తికేయ 2కు కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: చందు మొండేటి.
Going All Out Promoting Karthikeya2 Guest Appearing in Top Zee Tv Serials… Catch Me as Dr.Karthikeya in the Top Rated Tv Serial #RadhammaKuthuru #Karthikeya2onAugust12th
@anupamahere @AnupamPKher @Actorysr @chandoomondeti @vishwaprasadtg @AbhishekOfficl @zeecinemalu pic.twitter.com/QKEKUFeW3U— Nikhil Siddhartha (@actor_Nikhil) July 22, 2022