టాలీవుడ్ యువ హీరో నిఖిల్ సిద్దార్థ్ (Nikhil Siddharth) ఇటీవలే కార్తికేయ 2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు. చందూమొండేటి డైరెక్షన్లో పాన్ ఇండియా కథాంశంతో వచ్చిన ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లో మంచి వసూళ్లను రాబడుతోంది. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ సక్సెస్ఫుల్గా ప్రదర్శించబడుతోంది.
మిస్టరీ థ్రిల్లర్ జోనర్లో అనుపమ పరమేశ్వరన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించిన ఈ చిత్రం నెక్ట్స్ పార్టు (Karthikeya 3)పై ఇపుడొక న్యూస్ హల్ చల్ చేస్తోంది. నిఖిల్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాను భారీ సాంకేతిక విలువలతో ప్రాంఛైజీ (Karthikeya franchise)గా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పాడు.
అంతేకాదు కార్తికేయ 3 కూడా 3డీలో విడుదల కానుందని చెప్పి మూవీ లవర్స్లో ఇప్పటి నుంచే క్యూరియాసిటీని పెంచుతున్నాడు. కార్తికేయ 3 స్క్రిప్ట్ పనులు కూడా కొనసాగుతున్నాయని ఇన్ సైడ్ టాక్. కార్తికేయ 2 మలయాళం వెర్షన్ ఇవాళ కేరళలోని థియేటర్లలో విడుదల కానుంది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్పై నిర్మించిన ఈ చిత్రానికి కాలభైరవ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మెయిన్ హైలెట్గా నిలిచిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నిఖిల్ త్వరలోనే కార్తికేయ 3పై ప్రకటన ఉండబోతుందనే సంకేతాలు ఇస్తూ..అందరిలో జోష్ నింపుతున్నాడు.