టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) త్వరలో వీరసింహారెడ్డి (veerasimhareddy)గా బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichandh Malineni) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన కీలక అప్డేట్ ఒకటి ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది. తాజా టాక్ ప్రకారం నవంబర్ 18న ఈ సినిమా చివరి పాటను చిత్రీకరించనున్నారు.
బాలకృష్ణ, శృతిహాసన్ మధ్య వచ్చే డ్యుయెట్ సాంగ్ను షూట్ చేయనున్నారని తెలుస్తోండగా.. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన ఏమైనా వస్తుందేమో చూడాలంటున్నారు నెటిజన్లు, మూవీ లవర్స్. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తోంది. కన్నడ యాక్టర్ ధునియా విజయ్ విలన్గా నటిస్తుండగా..మరో యాక్టర్ కేజీఎఫ్ అవినాష్ కీ రోల్ చేస్తున్నాడు.
వీరసింహా రెడ్డి చిత్రంలో వరలక్ష్మి శరత్కుమార్ కీలక పాత్ర పోషిస్తోంది. ఎస్ థమన్ ఈ చిత్రానికి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ చిత్రం రాయలసీమలో జరిగిన వాస్తవ సంఘటనల నేపథ్యంలో పవర్ ఫుల్ పక్కా మాస్ ఎంటర్ టైనర్గా తెరకెక్కుతుంది. వీరసింహా రెడ్డి 2023 సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.
Read Also : Nidhhi Agerwal | ఇస్మార్ట్ బ్యూటీ ఫుల్ ఎంజాయ్ చేస్తున్న పాట ఇదేనట
Read Also : 80s actors | చిరంజీవి, రమ్యకృష్ణ, అర్జున్ డ్యాన్స్.. ట్రెండింగ్లో స్టిల్స్
Read Also : Gopichand30 | కోల్కతాలో సూపర్స్టార్ కృష్ణకు గోపీచంద్ 30 టీం నివాళి