Nayanthara | లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara), దర్శకుడు విఘ్నేష్ శివన్ (Vignesh Shivan) దంపతులు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. తల్లిదండ్రులైన తర్వాత మొదటి జన్మాష్టమి కావడంతో వేడుకలను కుటుంబ సభ్యుల సమక్షంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా తమ కవల కుమారులు ఉయిర్ (Uyir), ఉలగ్ (Ulag)కు శ్రీకృష్ణుడి గెటప్ వేసి మురిసిపోయారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను విఘ్నేష్ శివన్ సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
సుమారు ఏడేళ్లపాటు ప్రేమలో ఉన్న నయనతార, విఘ్నేశ్ శివన్ పెద్దల అంగీకారంతో గతేడాది జూన్ 9వ తేదీన వివాహబంధంతో ఒక్కటయ్యారు. మహాబలిపురంలోని ఓ రిసార్ట్లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లైన 4 నెలలకే సరోగసి పద్ధతి ద్వారా నయన్, విఘ్నేశ్ శివన్ దంపతులు కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. పిల్లలకు ఉయిర్ రుద్రోనిల్ ఎన్ శివన్ (Uyir RudroNeel N Shivan), ఉలగ్ దీవిక్ ఎన్ శివన్ (Ulag Daiwik N Shivan) అని నామకరణం కూడా చేశారు.
Also Read..
Groom | ఎల్ఈడీ లైట్స్తో రూపొందించిన లెహంగాలో మెరిసిన వధువు.. వీడియో వైరల్
Jawan Movie | జవాన్ బ్లాక్బస్టర్.. అనిరుధ్ ఎమోషనల్ ట్వీట్
Jawan | పర్ఫెక్ట్ మాస్ ఎంటర్టైనర్ జవాన్.. షారుఖ్ఖాన్కు మరో హిట్..!