బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో షారుక్ ఖాన్ (Shahrukh khan) ప్రస్తుతం సిద్దాంత్ ఆనంద్ డైరెక్షన్ లో పఠాన్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఆట్లీ (Atlee) తో కూడా ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) ను హీరోయిన్ గా హీరోయిన్గా ఫైనల్ చేశారు మేకర్స్. అయితే చాలా రోజుల తర్వాత ఈ సినిమాకు సంబంధించిన కీ అప్ డేట్ ఒకటి ఇపుడు బీటౌన్లో చక్కర్లు కొడుతోంది.
లయన్ (వర్కింగ్టైటిల్) టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమా ముంబై షూటింగ్ షెడ్యూల్ ఏప్రిల్ 18న ముగియనుందట. అంతేకాదు నయనతారం ఏప్రిల్ 18 లోపు ఈ షెడ్యూల్ను పూర్తి చేయనుందని టాక్. ఆ తర్వాత తన కొత్త చిత్రం కాతువాకుల రెండు కాధల్ సినిమా విడుదల నేపథ్యంలో నయన్ చెన్నైకు తిరుగు పయనం కానుందని సమాచారం. మరోవైపు రాజ్ కుమార్ హిరానీతో కూడా ఓ సినిమా లైన్లో పెట్టాడు షారుక్ఖాన్.
రాజ్కుమార్ హిరానీ, ఆట్లీ సినిమాలను బ్యాలెన్స్ చేసుకుంటూ షారుక్ ఖాన్ సినిమా చేస్తున్నాడు. మరోవైపు నయనతార ఏప్రిల్ 18 వరకు చిత్రీకరణ షెడ్యూల్ పూర్తి చేసుకుని.. విఘ్నేశ్ శివన్ సినిమా ప్రమోషన్స్ లో బిజీ కానుందని చిత్రయూనిట్ మెంబర్స్ వెల్లడించినట్టు బీటౌన్ మీడియా తన కథనంలో రాసుకొచ్చింది.