నందమూరి బాలకృష్ణ తన 107వ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా దర్శకుడు గోపీచంద్ మలినేని రూపొందిస్తున్నారు. శృతిహాసన్ నాయికగా నటిస్తున్నది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ ఫిల్మ్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతున్నది. అదేమిటంటే ఈ సినిమాను క్వాలిటీలో రాజీ పడకుండా వీలైనంత వేగంగా షూటింగ్ పూర్తి చేసి సంక్రాంతి పండక్కి విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ముందుగా ఈ చిత్రాన్ని డిసెంబర్ చివరలో విడుదల చేయాలనే ప్లాన్ చేసుకున్నారు.
అయితే టాలీవుడ్లో సంక్రాంతి భారీ సీజన్ కాబట్టి ఆ సమయానికే బాలకృష్ణ మూవీ రిలీజ్ బాగుంటుందని నిర్ణయానికొచ్చారట. వచ్చే నెల మొదటి వారంలో ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. దునియా విజయ్, వరలక్ష్మీ శరత్ కుమార్ ఇతర కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు : సాయిమాధవ్ బుర్రా, సంగీతం : థమన్ ఎస్, సినిమాటోగ్రఫీ : రిషి పంజాబీ, ఎడిటర్ : నవీన్ నూలి, దర్శకత్వం: గోపీచంద్ మలినేని.