తల్లాడ సాయికృష్ణ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘మిస్టరీ’. ఇటీవల చిత్రీకరణ ప్రారంభించుకున్న ఈ చిత్రానికి వెంకట్ పులగం నిర్మాత. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. దర్శక నిర్మాత మాట్లాడుతూ ‘ ఈ చిత్రంలో రవిరెడ్డి పవర్ఫుల్ పోలీస్ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు.
‘విరాటపర్వం’లో ఆయన పాత్ర అందరికి గుర్తుండిపోయింది. ఈ చిత్రంలో కూడా ఆయన కెరీర్లో గుర్తుండిపోయే పాత్రను ఈ చిత్రంలో చేస్తున్నాడు’ అన్నారు.