ఆర్ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి (Ajay bhupathi) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మహాసముద్రం (Maha Samudram). దసరా కానుకగా అక్టోబర్ 14న థియేటర్లలో సందడి చేయనుంది. శర్వానంద్ (Sharwanand), సిద్దార్థ్ (Siddharth) హీరోలుగా అనూ ఇమ్మాన్యుయేల్ , అదితీరావు హైదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతిబాబు, రావురమేశ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా హీరో సిద్దార్థ్ సినిమా గురించి పలు విషయాలు షేర్ చేసుకున్నాడు. నేను మహాసముద్రంను చూశానని, దాన్ని పూర్తిగా ఇష్టపడ్డానని సిద్దార్థ్ అన్నాడు.
అజయ్ స్క్రిప్ట్తో నా దగ్గరికి వచ్చినపుడు అతడు కథను, దానిలోని పాత్రలను రాసిన విధానం నన్ను ఆశ్చర్యపరిచింది. దీంతో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సినిమాకు ఓకే చెప్పేశానన్నాడు సిద్దార్థ్. కోస్టార్ శర్వానంద్ మంచి నటుడు. అతని యాక్టింగ్ చాలా నచ్చింది. శర్వానంద్ ఈ చిత్రంలో నటిస్తున్నాడని తెలియగానే చాలా సంతోషంగా ఫీలయ్యా. మా ఇద్దరి పాత్రలు ఇంటెన్స్ గా సాగడంతో..శర్వానంద్ నాకు గట్టి పోటీనే ఇచ్చాడు.
తన కొత్త లుక్ గురించి మాట్లాడుతూ…అజయ్ నాకు కథ చెప్పినప్పుడే.. ఇంతకుముందు సినిమాల కంటే నేను కొత్తగా కనిపించాలని నా మేకప్ మెన్ కు చెప్పాను. రెండు డిఫరెంట్ టైమ్ జోన్స్ లో సినిమా ఉంటుందని చాలా మంది తెలియదు. నా పాత్ర యూనిక్ స్టైల్ లో ఉంటుందన్నాడు. మహాసముద్రం తర్వాత బ్యాక్ టు బ్యాక్ తెలుగు సినిమాలు చేస్తానని చెప్పాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Seetimaarr | ఓటీటీలో ‘సీటీమార్’ ఈల వేసేది అప్పుడే..!
Konda Polam movie Review | కొండపొలం రివ్యూ
Chiranjeevi: కుటుంబంతో కలిసి ‘కొండ పొలం’ వీక్షించిన చిరంజీవి.. కామెంట్ ఏంటి?