ఎంపీ సంతోష్కుమార్ ఆరంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ విజయవంతంగా కొనసాగుతున్నది. సంగీత దర్శకుడు తమన్ విసిరిన చాలెంజ్ను స్వీకరించిన సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కల్యాణి మాలిక్ గురువారం జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్కులో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం తలపెట్టిన గొప్ప కార్యక్రమమిదని కొనియాడారు. సింగర్ చిన్మయి, రచయిత లక్ష్మీభూపాల్, సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్లను గ్రీన్ ఇండియా చాలెంజ్కు నామినేట్ చేశారు.