సినిమా ఇండస్ట్రీలో రోజుకు ఒక్క సెలబ్రిటీ అయిన మరణిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. గత కొద్ది రోజులుగా పలువురు సినీ ప్రముఖులు కరోనా కోరల్లో చిక్కుకుని మృత్యువాత పడుతున్నారు. కొందరు అనారోగ్యంతో కన్నుమూసతున్నారు. దర్శకుడు ఎస్పీ జననాథన్, హాస్యనటుడు వివేక్, ఛాయాగ్రాహకుడు, దర్శకుడు కె.వి.ఆనంద్ వంటి పలువురు ప్రముఖులను ఈ మహమ్మారి బలి తీసుకుంది. గురువారం రోజు నలుగురు కన్నుమూసారు. నిర్మాత ఇఎం ఇబ్రహీం , హాస్య నటుడు పాండు, గాయకుడు గోమగన్,దర్శకుడు సెల్వ తండ్రి భక్తవత్సలం తుది శ్వాస విడిచారు.
ఇక ఈ రోజు ఉదయాన్నే సీనియర్ సినీ గాయకుడు జి.ఆనంద్ (67) కరోనా బారిన పడి మరణించారనే వార్త విన్నాం. ఇక ఇప్పుడు మాయదారి మల్లిగాడు, గాజుల కిష్టయ్య, పంచాయితీ, సిరిమల్లె నవ్వింది, రక్తసంబంధం, శ్రీవారి శోభనం, రంభ రాంబాబు, మాయదారి మరిది వంటి హిట్ చిత్రాల నిర్మాత ఆదుర్తి సుబ్బారావు బావమరిది హీరో కృష్ణ కు సన్నిహితులు ఎమ్.ఎస్. ప్రసాద్ అనారోగ్యంతో కన్నుమూశారనే వార్త బయటకు వచ్చింది. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.