తెలుగులో పాపులారిటీ సంపాదించుకున్న రియాలిటీ షోల్లో ఒకటి బిగ్ బాస్ (Biggboss). ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 5 (Biggboss Season 5 Telugu) కొనసాగుతుండగా..ఈ షో శనివారానికి 97వ రోజులు పూర్తి చేసుకుంది. అక్కినేని నాగార్జున (Nagarjuna)హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ షోలో ప్రముఖ వ్యక్తి సందడి చేయబోతున్నారు. బిగ్బాస్-5లో 98వ రోజు (ఎపిసోడ్) ముఖ్యఅతిథిగా గ్రీన్ ఇండియా చాలెంజ్ (Green india challenge) సృష్టికర్త, ఎంపీ సంతోష్కుమార్ (MP Santosh kumar) రాబోతున్నారు.
ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రసారం కానున్న ఈ షోలో ఎంపీ సంతోష్కుమార్ హాజరుకానున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. బిగ్ బాస్ సీజన్ 5 తుదిదశకు చేరుకుంది. తాజా సీజన్ మరో వారం రోజుల్లో ముగియనుంది. ప్రస్తుతం హౌజ్లో ఆరుగురు కంటెస్టెంట్లు శ్రీరామ్, సన్నీ, షణ్ముఖ్, సిరి, మానస్, కాజల్ ఉండగా..వీరిలో నేడు కాజల్ (Kajal)ఎలిమినేట్ కాబోతున్నట్టు టాక్. మిగిలిన వారిలో చివరికి ఒకరిని విజేతగా ప్రకటించనున్నారు. అయితే ఈ సారి బిగ్ బాస్ 5 టైటిల్ను ఎవరు గెలుచుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఆ విజేత ఎవరనేది త్వరలోనే తెలియనుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Akhanda:సెంచరీ కొట్టిన బాలయ్య.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న అఖండ
Suma: జయమ్మ పంచాయితీ టీజర్లో పంచ్లు బాగానే ఉన్నాయిగా..!
Pragya Jaiswal | ‘అఖండ’తో ఎప్పుడూ లేని అనుభూతి : ప్రగ్యాజైశ్వాల్