నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ చిత్రం బాక్సాఫీస్ దగ్గర గర్జిస్తుంది. డిసెంబర్ 2న విడుదలైన అఖండ పది రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ మార్క్ను అందుకుని ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేశాయి. ఇప్పటి వరకు బాలయ్య కెరీర్లో ఎక్కువ గ్రాస్ను కలెక్ట్ చేసిన సినిమాగా గౌతమీ పుత్ర శాతకర్ణి నిలిచింది. కాని ఆ సినిమా రికార్డ్లని బద్దలు కొట్టి తొలి వారంలోనే అఖండ ఆ కలెక్షన్స్ దాటేసి ఇప్పుడు వంద కోట్ల గ్రాస్ మార్క్ను టచ్ చేసింది.
ఆంధ్ర నైజాం లో గట్టిగానే రాబట్టిన అఖండ 10 రోజులకు కలిపి రూ. 49.34 కోట్లు వసూలు చేసిన అఖండ కర్నాటకతో పాటు మిగతా రాష్ట్రాల్లో అలాగే ఓవర్సీస్లో మొత్తంగా రూ. 9.35 కోట్లు రాబట్టింది. ఇక వరల్డ్ వైడ్ గా రూ. 58.74 కోట్లు షేర్ రాగా రూ. 100 కోట్లు గ్రాస్ను రాబట్టినట్లు సమాచారం. గౌతమిపుత్ర సినిమాతో 75కోట్ల బాక్సాఫీస్ వసూళ్లను అందుకున్న బాలయ్య ఈసారి అఖండతో మొదటిసారి సెంచరీ కొట్టేశాడు.
సింహా, లెజెండ్ అనంతరం పవర్ఫుల్ కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టారు. రూ. 54 కోట్ల టార్గెట్ తో మార్కెట్ లోకి వచ్చిన ఈ సినిమా 8రోజుల్లోనే టార్గెట్ ను ఫినిష్ చేసింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా రూ. 58.78 కోట్లు వసూలు చేసింది. ధీంతో ఇప్పటికే మూడు కోట్ల వరకు లాభాలను అందుకున్నట్లు సమాచారం. ఇక ఆదివారం కూడా సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది.