తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని స్టార్ హీరో మోహన్ లాల్ (Mohanlal). బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మూవీ లవర్స్ కు ఎప్పుడూ ఏదో ఒక అప్డేట్ అందిస్తుంటాడు మోహన్లాల్. ఈ స్టార్ యాక్టర్ ప్రస్తుతం లిజో జోష్ పెల్లిస్సెరీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుండగా.. ఈ చిత్రానికి మలైకొట్టై వాలిబన్ (Malaikottai Valiban) టైటిల్ ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే.
ఇటీవలే ఈ చిత్రం ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈస్టర్ సందర్భంగా అభిమానులు, ఫాలోవర్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. సోషల్ మీడియా ద్వారా మలైకొట్టై వాలిబన్ ప్రీ లుక్ పోస్టర్ను విడుదల చేస్తూ.. కొత్త అప్డేట్ అందించాడు మోహన్ లాల్. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ను ఏప్రిల్ 14న లాంఛ్ చేస్తున్నట్టు ప్రకటించాడు. నీలాకాశాన్ని తాకుతున్నట్టుగా చుట్టూ కొండల మధ్య పాదముద్రలుండగా.. వాటి మధ్యలో నీళ్లున్నాయి. చాలా కొత్తగా కనిపిస్తున్న ఈ లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.
ఈ చిత్రంలో విద్యుత్ జమ్వాల్, రాధికా ఆప్టే, సోనాలీ కులకర్ణి, డానిష్ సేత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మ్యాక్స్ ల్యాబ్స్-సెంచురీ ఫిలిమ్స్ బ్యానర్లపై జాన్-మేరీ క్రియేటివ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Here’s #MalaikottaiVaaliban wishing everyone a happy Easter!
On this day of hope, faith and redemption, here’s an important update – The First-Look poster of Malaikottai Vaaliban is reaching you on April 14th!
Stay tuned in!#MalaikottaiVaalibanFL #LijoJosePellissery pic.twitter.com/upI9eBWr38
— Mohanlal (@Mohanlal) April 9, 2023
Read Also :
Karthik Ghattamaneni | పుకార్లకు చెక్ పెట్టిన రవితేజ డైరెక్టర్..
Mrunal Thakur | చాలా ఎక్జయిటింగ్గా ఉందంటోన్న మృణాళ్ ఠాకూర్