బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అభిమానులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించడంలో బిజీగా ఉన్నాడు రవితేజ (Ravi Teja). నెల వ్యవధిలోనే ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు మాస్ మహారాజా. రవితేజ తాజాగా యాక్షన్ థ్రిల్లర్ రావణాసురతో థియేటర్లలో సందడి చేస్తున్నాడు. ప్రస్తుతం రవితేజ ఖాతాలో పాన్ ఇండియా ప్రాజెక్ట్ టైగర్ నాగేశ్వర్ రావు (Tiger Nageswara Rao), ఈగల్ (Eagle) సినిమాలున్నాయి.
టాలీవుడ్ సర్కిల్ టాక్ ప్రకారం ఈగల్ ఇప్పటికే పోలండ్లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఇదిలాఉంటే ఈగల్ హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ John Wickకు రీమేక్గా వస్తుందంటూ గాసిప్స్ తెరపైకి వస్తున్నాయి. వీటిపై డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni) తాజా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. ఈగల్ ఏ సినిమాకు కాపీ కాదన్నాడు కార్తీక్.
ఈగల్ వ్యవస్థపై రవితేజ పోరాటం దిశగా సినిమాగా ఉంటుందని, రవితేజ నటిస్తోన్న టైగర్ నాగేశ్వర్ రావు షూటింగ్ పూర్తయిన తర్వాత ఈ మూవీ రెండో షెడ్యూల్ జూన్లో మొదలు కానుందని కార్తీక్ ఘట్టమనేని చెప్పాడు. టైగర్ నాగేశ్వర్ రావు విడుదల తర్వాత ఈగల్కు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుందని ఇన్సైడ్ టాక్. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.