Drishyam 3 | మాలీవుడ్తోపాటు తెలుగు, హిందీ భాషల్లో బాక్సాఫీస్ను షేక్ చేసిన ప్రాంచైజీ దృశ్యం (Drishyam). మలయాళంలో క్రైం థ్రిల్లర్ జోనర్లో వచ్చిన ఈ మూవీకి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించాడు. ఈ ప్రాంచైజీలో వస్తోన్న దృశ్యం 3 రిలీజ్ డేట్ వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు నయా పోస్టర్తో క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్.
ఈ చిత్రాన్ని మే 21న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అంటే సూర్య నటించిన కరుప్పు విడుదలైన వారం తర్వాత దృశ్యం 3 రానుందన్నమాట. మోహన్ లాల్ (Mohan lal), మీనా లీడ్ రోల్స్లో నటిస్తోన్న ఈ చిత్రం రిలీజ్కు ముందే థియాట్రికల్, డిజిటల్ రైట్స్ విషయంలో హాట్ టాపిక్గా నిలుస్తోంది.
దృశ్యం 3 థ్రియాట్రికల్, డిజిటల్ రైట్స్ కలిపి ఏకంగా రూ.350 కోట్లు పలికాయని మాలీవుడ్ సర్కిల్లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. జార్జ్కుట్టీ (మోహన్ లాల్ పాత్ర) ఫ్యామిలీ చుట్టూ తిరిగే కథతో తెరకెక్కిన దశ్యం ప్రాంచైజీలో వచ్చిన రెండు పార్టులు ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్స్గా నిలిచాయి. ఫస్ట్ పార్ట్ థియేటర్లో విడుదలవగా.. రెండో పార్టు ఓటీటీలో విడుదలైంది. ఆశీర్వాద్ సినిమాస్ దశ్యం 3ని తెరకెక్కిస్తోంది. మరి మూడో పార్టు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
దృశ్యం కథ తెలుగు, తమిళం, హిందీతోపాటు వివిధ భాషల ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్ అయిందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికే తెలుగులో వెంకటేశ్, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో రీమేక్ అయి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
#Drishyam3 | May 21 Release💥 pic.twitter.com/ze6AbrnNry
— Christopher Kanagaraj (@Chrissuccess) March 23, 2026
Mangli | మైక్రో ఫైనాన్స్ మోసాలపై సింగర్ మంగ్లీ క్లారిటీ.. నా పేరుతో డబ్బులు వసూలు చేస్తే నమ్మోద్దు..
Iran: మేం కూడా పవర్ ప్లాంట్లను ధ్వంసం చేస్తాం: ఇరాన్ వార్నింగ్