తొలి తెలుగు ఓటీటీ ఆహా టాక్ షోలతో సరికొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. వైవిధ్యమైన వినోదాన్ని అందించేందుకు సరికొత్త కార్యక్రమాలను తీసుకొస్తుంది. రీసెంట్గా బాలకృష్ణతో అన్స్టాపబుల్ అనే షో చేయబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.మొదటి ఎపిసోడ్లో భాగంగా బాలకృష్ణ మంచు కుటుంబ సభ్యులతో ఈ షోను నిర్వహించనున్నారని సమాచారం.
ఇప్పటి వరకు సినిమాల్లో పంచ్ డైలాగ్లతో సందడి చేసిన బాలయ్య ఇప్పుడు మారి తోటి తారలను ఆకట్టుకోనున్నాడన్నమాట. ‘ది బాప్ ఆఫ్ ఆల్ టాక్ షోస్ అంటూ ఈ షోపై ఆసక్తి రేకెత్తించారు. నవంబర్ 4 నుండి ఈ షో ఆహాలో ప్రసారం కానుంది.తొలి సీజన్లో 12 ఎపిసోడ్లు ఉండనున్నట్లు సమాచారం. అంటే ఎంత కాదన్నా ఈ షో కోసం బాలకృష్ణ రూ. 5 కోట్లు తీసుకోనున్నట్లు చర్చ జరుగుతోంది.
ఇక మరో సీనియర్ హీరో మోహన్ బాబు కూడా ఇప్పుడు హోస్ట్గా మారబోతున్నాడనే టాక్ వినిపిస్తుంది. ఆహా టీం ప్రస్తుతం మోహన్ బాబుతో సంప్రదింపులు జరుపుతున్నట్టు టాక్. ఇప్పటికే మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ ఆహా కోసం వంటల కార్యక్రమం చేస్తున్న విషయం తెలిసిందే. మోహన్ బాబు వార్తకి సంబంధించి త్వరలో పూర్తి క్లారిటీ రానుంది.