టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి (MM Keeravani) ఇంట విషాదం చోటుచేసుకుంది. ఎంఎం కీరవాణి తల్లి భానుమతి బుధవారం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న భానుమతిని కుటుంబసభ్యులు మూడు రోజుల క్రితం కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఆరోగ్యం క్షీణించడంతో ఇవాళ తుదిశ్వాస విడిచారు.
భానుమతి భౌతికకాయాన్ని మరికాసేపట్లో ఎస్ఎస్ రాజమౌళి నివాసానికి తీసుకెళ్లనున్నారు. తల్లి మృతితో కీరవాణి ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. మాతృమూర్తి మరణంతో తీవ్ర శోకంలో ఉన్న ఎంఎం కీరవాణి కుటుంబసభ్యులకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు.
Read Also : Ram Charan | ఆధ్యాత్మిక కార్యక్రమానికి రాంచరణ్కు ఆహ్వానం.. వివరాలివే
Read Also : Waltair Veerayya | వాల్తేరు వీరయ్య ఈవెంట్కు టైం ఫిక్స్.. ప్రకటనే తరువాయి..!
Read Also : Aadhi Pinishetty | ఆది పినిశెట్టి బర్త్ డే స్పెషల్.. శబ్దం లుక్ రిలీజ్