హైదరాబాద్: తెలుగుదనాన్ని, సంస్కృతి, సాంప్రదాయాలను అణువణువునా ప్రతిబింబించేలా అద్భుతమైన సినిమాలు అందించిన కళాతపస్వి, ప్రముఖ దర్శకులు కే.విశ్వనాథ్ మృతి బాధాకరమని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. విశ్వనాథ్ గారిని కోల్పోవడం తెలుగు ప్రేక్షకులకి, సినీ పరిశ్రమకు తీరని లోటన్నారు. చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న విశ్వనాథ్ గారు, తెలుగు సినిమాల గొప్పతనాన్ని అంతర్జాతీయ వేదికలపైకి చేర్చారని కొనియాడారు. తెలుగు సినిమా ఉన్నంత వరకు ఆయన పేరు చిరస్థాయిగా నిలిచి ఉంటుందని పేర్కొన్నారు.
ప్రముఖ దర్శకులు,పద్మశ్రీ కే.విశ్వనాథ్ గారి మృతి బాధాకరం.వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.ఆయన మృతి తెలుగు ప్రేక్షకులకు,చిత్ర పరిశ్రమకు తీరని లోటు. కళాతపస్విగా చెరగని ముద్ర వేసి,తెలుగు హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను pic.twitter.com/66MftX5sQC
— Harish Rao Thanneeru (@BRSHarish) February 3, 2023
భారతదేశ సినీ పరిశ్రమలో తెలుగువారి పేరు చిరస్థాయిలో నిలిచిపోయేలా చేసిన ప్రముఖ దర్శకుడు కళా తపస్వి కే.విశ్వనాథ్ గారి మరణం తీరని లోటని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఎన్నో మరపురాని చిత్రాలను, అనేక సందేశాత్మక చిత్రాలను రూపొందించిన గొప్ప దర్శకులని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
భారతదేశ సినీ పరిశ్రమలో తెలుగువారి పేరు చిరస్థాయిలో నిలిచిపోయేలా చేసిన ప్రముఖ దర్శకుడు కళా తపస్వి, పద్మశ్రీ కే. విశ్వనాథ్ గారి మరణం తీరని లోటు. విశ్వనాథ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను #Vishwanath pic.twitter.com/2pUhiJTn1d
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 3, 2023
కే.విశ్వనాథ్ మహాభినిష్క్రమణం తెలుగు సినీ రంగానికి తీరని లోటని మంత్రి ఇంద్రకరన్ రెడ్డి అన్నారు. భారతీయ, తెలుగు సంస్కృతికి చిహ్నమైన శాస్త్రీయ కళలను కథలుగా ఎన్నో అద్భుత సినిమాలు చేశారని కొనియాడారు. ఆయన చేసిన సినిమాలు తెలుగు చలనచిత్ర రంగానికి ఎనలేని ప్రతిష్టను తెచ్చాయని పేర్కొన్నారు. విశ్వనాధ్ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు.
తెలుగు సంస్కృతి, భారతీయ కళలకు తన సినిమాల ద్వారా కే.విశ్వనాథ్ గొప్ప గుర్తింపును తీసుకొచ్చారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సినీ సాహిత్యానికి, సంప్రదాయ సంగీతానికి, తెలుగు చలనచిత్ర రంగానికి ఎనలేని ప్రతిష్టను తీసుకొచ్చిన గొప్ప దర్శకులని చెప్పారు. ఆయన మృతి తెలుగు సినీ పరిశ్రమకు, అభిమానులకు తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఆయనకుంటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలిపారు.