మల్లాపూర్, జూలై 5 : ప్రతి కార్యాలయం, కాలనీల్లో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి కోరారు. ఏడో విడుత హరితహారం కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన మల్లాపూర్ డివిజన్ టీఎస్ఎస్పీడీసీఎల్ అసిస్టెంట్ ఇంజినీర్ కార్యాలయం ఆవరణలో కార్పొరేటర్ పన్నాల దేవేందర్రెడ్డి, అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సారథ్యంలో హరితహారం కార్యక్రమం యజ్ఞంలా కొనసాగుతున్నదన్నారు. ప్రతిఒక్కరూ ఇంటికి ఐదు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. నాటిన మొక్కలకు ప్రతిరోజు నీరుపోసి కంటికి రెప్పలా కాపాడుకోవాలన్నారు. డివిజన్లో పచ్చదనం ఉన్న వీధి, ఇల్లు తన దష్టికి వస్తే వారిని ప్రత్యేకంగా సత్కరిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కాప్రా డీసీ శంకర్, జలమండలి మేనేజర్ సాయిబాబా, ఏఈలు చంద్ర ప్రకాశ్రెడ్డి, వేణు, హర్టికల్చర్ సూపర్వైజర్ సర్వోత్తంరెడ్డి, ఎంటమాలజీ సిబ్బంది, జీహెచ్ఎంసీ ఎలక్ట్రికల్ సిబ్బంది, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు కిరణ్కుమార్రెడ్డి, హమాలీ శ్రీనివాస్, వాసుదేవ్గౌడ్, సానల రవి, రాపోలు సతీశ్, కట్ట నాగరాజు, అశోక్గౌడ్, నర్సిరెడ్డి, విద్యార్థి విభాగం నాయకుడు శ్రావణ్రెడ్డి, వినయ్రెడ్డి, మహేందర్, స్థానికులు పీజీ సుదర్శన్, శ్రీశైలం, తదితరులు పాల్గొన్నారు.
మల్లాపూర్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా సోమవారం మీర్పేట్ హెచ్బీకాలనీ డివిజన్ కైలాసగిరిలో కార్పొరేటర్ జె. ప్రభుదాస్, డివిజన్ అధ్యక్షుడు జి. శ్రీనివాస్రెడ్డి పాదయాత్ర చేశారు. కాలనీవాసుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాలనీలో నీటి సమస్య, విద్యుత్, బోరు మోటర్లు రిపేరు వంటి సమస్యలను స్థానిక ప్రజలు కార్పొరేటర్కు విన్నవించారు. త్వరలోనే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తానని కార్పొరేటర్ కాలనీవాసులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈ తిరుమలయ్యగౌడ్, వర్క్ ఇన్స్పెక్టర్ చారి, ఎలక్ట్రికల్ ఏఈ సుఖేందర్రెడ్డి, జలమండలి ఏఈ వేణుగోపాల్, లక్ష్మీనర్సయ్య, నాయకులు బాల్రాజ్, జ్యోతి, నవీన్ గౌడ్, బాలనర్సింహ, కుమార్, శేఖర్గౌడ్, జీహెచ్ఎంసీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
రామంతాపూర్ : పట్టణ ప్రగతిలో భాగంగా సోమవారం రామంతాపూర్ డివిజన్లోని రాంశంకర్నగర్, వివేక్నగర్, శ్రీనివాసపురం, తదితర ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణి, అధికారులు పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ తదితర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని కార్పొరేటర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీ అరుణకుమారి, డీఈ నాగమణి, నోడల్ అధికారి రాజు, డీజీఎం శ్రీధర్రెడ్డి, కిషన్, కఠారియా, స్థానికులు చెన్నయ్య, శశిధర్, నవీన్, శ్రీనివాస్రెడ్డి, బీజేపీ డివిజన్ అధ్యక్షుడు బండారు వెంకట్రావు, కుమారస్వామి, నందకిశోర్ యాదవ్, నాగేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఉప్పల్ : సమస్యల పరిష్కారానికి పట్టణ ప్రగతి ఎంతో దోహదపడుతుందని చిలుకానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్ అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా డివిజన్లోని పలు కాలనీలు, బస్తీల్లో కార్పొరేటర్ సోమవారం పర్యటించారు. బస్తీవాసులు పలు సమస్యలను కార్పొరేటర్, అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ మేరకు పలు అంశాలపై చర్చించారు. విద్యుత్ స్తంభాలు, మైసమ్మ టెంపుల్ ప్రాంతంలో లీకేజీ, కలుషిత నీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. చెత్త పేరుకుపోకుండా, డ్రైనేజీ సమస్యలు లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అరుణకుమారి, చిలుకానగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, పల్లె నర్సింగ్రావు, ఎదుల్ల కొండల్రెడ్డి, ఈరెల్లి రవీందర్రెడ్డి, రాంరెడ్డి, వీబీ.నర్సింహ, మహేందర్, జగన్, శేఖర్, శ్యాం, రవీందర్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
కాప్రా: కాప్రా డివిజన్ పరిధిలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమం సోమవారం సాకేత్ ఫేజ్ 2, లక్ష్మీనగర్ కాలనీల్లో స్థానిక కార్పొరేటర్ స్వర్ణరాజు నేతృత్వంలో జరిగింది. సాకేత్ఫేజ్-2 కొత్త కాలనీ కావడంతో తాగునీరు, డ్రైనేజీ, రోడ్డు సమస్యలతో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారని, స్థానిక సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటానని కార్పొరేటర్ తెలిపారు. లక్ష్మీనగర్కాలనీలో హరితహారం నిర్వహించి మొక్కలు నాటారు. ఏఈఈ అభిషేక్, కాలనీ అధ్యక్షుడు జిట్టా సంతోష్రెడ్డి, రామచంద్ర రావు, టీఆర్ఎస్ నాయకులు గిల్బర్ట్, రవీందర్రావు, కొప్పులకుమార్, గౌస్, మల్లారెడ్డి, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.