Sai dharam tej latest photos | మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఈ మధ్య కాలంలో బయటికి బాగానే వస్తున్నాడు. యాక్సిడెంట్ తర్వాత దాదాపు 45 రోజుల పాటు ఎవరికీ కనిపించకుండా ఉన్న ఈయన.. దీపావళి సందర్భంగా తీసిన ఫోటోలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అందులో చాలా సన్నగా ఉన్నాడు సాయి ధరమ్ తేజ్. ఆ తర్వాత మెల్ల మెల్లగా బరువు పెరుగుతూ వచ్చాడు. ఈ మధ్య క్రిస్మస్ సందర్భంగా విడుదలైన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అందులో కుటుంబ సభ్యులతో పాటు ఎంజాయ్ చేస్తున్నాడు తేజూ. అంతేకాదు మునుపటి లుక్లోకి వచ్చి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చాడు. తాజాగా మరోసారి సాయిధరమ్ తేజ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ఫొటోలు చూసిన తర్వాత అభిమానులు సాయిధరమ్ తేజ్ ఈజ్ బ్యాక్ అన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఫొటోలు చూస్తుంటే తేజూ పూర్తిగా కోలుకున్నట్లు స్పష్టమవుతుంది. ఇటీవల సాయిధరమ్ తేజ్ ఇంటికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెళ్లి ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. ఈ ఫొటోలను మెగా మేనల్లుడు సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూర్తిగా కోలుకున్న సాయి ధరమ్తేజ్ను చూసి అభిమానులు కూడా సంతోషిస్తున్నారు. సెప్టెంబర్ 10న సాయిధరమ్ తేజ్కు యాక్సిడెంట్ జరిగింది. కేబుల్ బ్రిడ్జి సమీపంలో ఈయన నడుపుతున్న బైక్.. రోడ్డు మీద ఇసుక కారణంగా స్కిడ్ అయి కిందపడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. దాదాపు 45 రోజుల తర్వాత ఈయన కోలుకుని ఇంటికి వచ్చాడు. ఫిబ్రవరి తర్వాత షూటింగ్లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నాడు సాయి ధరమ్ తేజ్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
సినీ ఇండస్ట్రీ పెద్దగా ఉండను.. పెద్దరికంపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు
రెండు సినిమాలకు కమిటైన సాయి ధరమ్ తేజ్.. షూటింగ్ ఎప్పుడో..?
Sankranthi Releases | లైన్క్లియర్..సంక్రాంతికి రెడీ అంటున్న చిన్న చిత్రాలివే
Pushpa Deleted Scene | పుష్ప డిలీటెడ్ సీన్ చూశారా? ఈ సీన్ను ఎందుకు డిలీట్ చేశారో తెలుసా?