ఆర్ఎక్స్ 100 సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు టాలీవుడ్ (Tollywood)మ్యూజిక్ కంపోజర్ చేతన్ భరద్వాజ్ (Chaitan Bharadwaj). ఈ చిత్ర దర్శకుడు అజయ్ భూపతి (Ajay Bhupathi) తో కలిసి మహాసముద్రం (Maha Samudram)సినిమాకు మరోసారి పనిచేస్తున్నాడు చేతన్ భరద్వాజ్. ఇటీవలే విడుదలైన మహాసముద్రం ట్రైలర్ లో చేతన్ భరద్వాజ్ కంపోజ్ చేసిన బీజీఎం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అక్టోబర్ 14న మహాసముద్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ సందర్భంగా చేతన్ భరద్వాజ్ ఇంటర్వ్యూలో పలు విషయాలు షేర్ చేసుకున్నాడు. ఈ సినిమా పలు భావోద్వేగాలతో సాగుతుంది.చివరి అరగంట ఇంటెన్స్ డ్రామా నేపథ్యంలో ఉంటుంది. థియేటర్లలో నుంచి ప్రతీ ఒక్కరూ నిశ్శబ్దంగా బయటకు వస్తారు. అజయ్ భూపతి వివిధ రకాల భావోద్వేగాలను చాలా కొత్తగా చూపించాడు. ఈ సినిమాకు సంగీతం అందించడం, బీజీఎం సమకూర్చడం సవాలుతో కూడుకున్న పని అని చెప్పుకొచ్చాడు.
ఆర్ఎక్స్ 100 సినిమా లాగే ట్విస్టులను ఊహించవచ్చా..? అన్న ప్రశ్నకు స్పందిస్తూ..మహా సముద్రం మీ అన్ని అంచనాలను పూర్తి అందుకుంటుంది. ఈ సినిమాలోని చాలా మలుపులు మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం ఖాయం. అజయ్ భూపతి మరోసారి ఈ చిత్రం కోసం అద్బుతంగా పనిచేశాడు. ఈ చిత్రంలో చెప్పకే పాట నాకు చాలా ఇష్టమైంది. మిగిలిన పాటలు కూడా పాపులర్ అవుతాయి. హే రంభ పాటను కంపోజ్ చేసింది నేనేనని చాలా మంది తెలియదు. ఒక్కసారి సినిమా విడుదలయ్యాక అన్ని పాటలకు మంచి స్పందన వస్తుందని ధీమాగా చెప్పాడు చేతన్.
Faria abdullah: రోడ్డుపై జాతి రత్నాలు బ్యూటీ తీన్మార్ డ్యాన్స్.. వీడియో వైరల్
MAA Elections | ‘మా’ ఎన్నికలపై నటుడు రవిబాబు సంచలన వ్యాఖ్యలు
Chiranjeevi | గర్వంగా చెబుతున్నా అది నా సొంత డబ్బు: చిరంజీవి