Acharya Movie | చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలను ఒకే చేస్తూ షూటింగ్లను కూడా పూర్తి చేస్తున్నాడు. గతంలో ఎన్నడు లేనట్టుగా చిరు వేగంగా సినిమాలను పూర్తి చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్చరణ్ కీలకపాత్రలో నటించాడు. ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలున్నాయి. ఇక ఇటీవలే విడుదలైన ట్రైలర్ అంచనాలను రెట్టింపు చేసింది. ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్రం నుంచి ఏదో ఒక అప్డేట్ బయటకు వస్తూనే ఉంది. లేటెస్ట్గా మరో బిగ్ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఈ చిత్రానికి సూపర్ స్టార్ మహేష్బాబు వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా మహేష్బాబు వాయిస్ ఓవర్తో మొదలవుతుందట. ఇద్దరు హీరోల ఇంట్రడక్షన్ మహేష్ వాయిస్ పరిచయం చేస్తుందని టాలీవుడ్ వర్గాల్లో సమాచారం. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని మాట్నీ ఎంటర్టైనమెంట్స్ సంస్థతో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్పై రామ్చరణ్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు.
Read Also:
Priyanka Chopra | ప్రియాంక-నిక్ జోనస్ల కూతురు పేరేంటో తెలుసా?
Vijay Devarakonda-Samantha | గ్రాండ్గా లాంఛ్ అయినా విజయ్ సమంతల కాశ్మీర్ ప్రేమకథ!
Maruthi | ప్రముఖ దర్శకుడు మారుతి తండ్రి కన్నుమూత