Director Maruthi | టాలీవుడ్ దర్శకుడు మారుతి ఇంట విషాదం నెలకొంది. మారుతి తండ్రి దాసరి వనకుచలరావు కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వనకుచలరావు బుధవారం అర్థరాత్రి మచిలీపట్నంలోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచాడు. విషయం తెలిసిన పలువురు సినీప్రముఖులు మారుతికి ఫోన్ చేసి పరామర్శిస్తున్నారు.
టాలీవుడ్ సక్సెస్ ఫుల్ దర్శకులలో మారుతి ఒకడు. డిస్ట్రిబ్యూటర్గా కెరీర్ ఆరంభించిన మారుతి ‘ఈ రోజుల్లో’ సినిమాతో మెగాఫోన్ పట్టాడు. ‘బస్స్టాప్’, ‘భలేభలే మగాడివోయ్’, ‘మహానుభావుడు’ వంటి సినిమాలతో అగ్ర దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈయన దర్శకత్వం వహించిన ‘పక్కా కమర్షియల్’ విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో పాటుగా మారుతి ప్రభాస్తో ఓ సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్పైకి వెళ్ళనుంది.