Maheshbabu | సూపర్ స్టార్ మహేష్బాబు ఓ వైపు వరుస సినిమాలను చేస్తూనే మరో వైపు యాడ్స్లో నటిస్తున్నాడు. ఇప్పటికే డజనుకు పైగా యాడ్స్లో నటించాడు. గతంలో మహేష్ థమ్సప్ యాడ్కు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడు. తాజాగా ఆ కంపెనీతో ఒప్పందం పూర్తయింది. దాంతో ప్రస్తుతం థమ్సప్ యాడ్కు బ్రాండ్ అంబాసిడర్గా విజయ్ దేవరకొండ ఉన్నాడు. ఈ క్రమంలో మహేష్బాబు తాజాగా మౌంటెన్ డ్యూ యాడ్తో అగ్రిమెంట్ కుదిరించుకున్నాడు. దుబాయ్ లోని బుర్జ్ ఖలీషా దగ్గర ఈ యాడ్ను షూట్ చేశారు. హిందీలో ఈ యాడ్ను హృతిక్ రోషన్ చేయగా, తెలుగుతో మహేష్ బాబు చేశాడు. గతంలోనూ మౌంటెన్ డ్యూ యాడ్లో మహేష్ నటించాడు. తాజాగా మహేష్ ఈ యాడ్కు తీసుకున్న రెమ్యునరేషన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.
గతంలో మౌంటెన్ డ్యూ యాడ్కు మహేష్ ఏడాది అగ్రిమెంట్కు 7కోట్లు తీసుకోగా ఇప్పుడు ఏకంగా 12 కోట్ల పారితోషకాన్ని తీసుకున్నాడట. మహేష్ సంవత్సరం పాటు ఈ యాడ్ను సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేయాల్సి ఉంటుందట.అంతేకాకుండా అగ్రిమెంట్ పూర్తయ్యే వరకు ఈ కంపెనీ మహేష్ బాబు ఫోటోలను వీడియోలను వాడుకోవచ్చట. ఇంతకుముందు ఈ యాడ్లో అక్కినేని అఖిల్ నటించాడు. ఇక మహేష్ బాబు ప్రస్తుతం సర్కారువారి పాట సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. గీతాగోవిందం ఫేం పరుశురాం ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా మైత్రి సంస్థతో కలిసి మహేష్ కో-ప్రొడ్యూసర్గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుంది.
Read More :
“రాజమౌళి, మహేశ్ బాబు సినిమాలో విలన్గా టాలీవుడ్ స్టార్ హీరో..?”
“Unstoppable Finale Promo | నాదో చిన్న కోరిక..మహేశ్ బాబును అడిగిన బాలకృష్ణ..ప్రోమో అదిరింది”
“Sarkaru Vaaru Paata | సర్కారు వారి పాట షూట్ షురూ..మహేశ్ జాయిన్ అయ్యేది ఎప్పుడంటే..?”