టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu) నటిస్తోన్న తాజా ప్రాజెక్టు సర్కారు వారి పాట (Sarkaru Vaaru Paata). పరశురాం డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. సర్కారు వారి పాట కొత్త షెడ్యూల్ ఇవాళ హైదరాబాద్లో షురూ అయింది. తాజా అప్ డేట్ ప్రకారం మహేశ్ బాబు ఫిబ్రవరి రెండో వారంలో సెట్స్ లో జాయిన్ కానున్నాడు. ఈ షెడ్యూల్లో పలువురు ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట పరశురాం టీం.
మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తిసురేశ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఎస్ థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్టును ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తుండగా..రిలీజ్ డేట్లో మార్పులు జరిగే అవకాశమున్నట్టు టాక్ నడుస్తోంది.
మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్తో మహేశ్ బాబు చేయనున్న 28వ ప్రాజెక్టు ఫిబ్రవరి 3న పూజా కార్యక్రమాలు జరుపుకోనుంది. మార్చిలో రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుండగా..ఈ చిత్రంలో పూజాహెగ్డే, సంయుక్తా మీనన్ను ఫీ మేల్ లీడ్ రోల్స్ చేస్తున్నారు.