Mahesh Babu | టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu) అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి ఎస్ఎస్ఎంబీ 28 (SSMB 28). త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) డైరెక్ట్ చేస్తున్నాడు. నేడు సూపర్ స్టార్ కృష్ణ మొదటి జయంతి (Krishnas birth anniversary) సందర్భంగా ఎస్ఎస్ఎంబీ 28 నుంచి ఓ పోస్టర్ని విడుదల చేసింది చిత్ర బృందం. ‘ఎవర్గ్రీన్ సూపర్స్టార్ కృష్ణ గారి లెగసీని సెలబ్రేట్ చేసుకుంటూ’ అంటూ కార్నర్లో కృష్ణ ఫోటోని పెట్టారు.
పోస్టర్లో ఎర్ర చొక్కా ధరించి తలకు రిబ్బన్తో మహేశ్ చాలా రోజుల తర్వాత ఊరమాస్ లుక్లో కనిపించాడు. కాగా, ఈ పోస్టర్ను మహేశ్ తన అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘ఈ రోజు మరింత ప్రత్యేకమైంది. ఇది నీ కోసమే నాన్నా..(మూడు లవ్ సింబల్స్)’ అంటూ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్, మహేశ్ లుక్ వైరల్ అవుతోంది.
మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన అతడు, ఖలేజా తర్వాత మూడోసారి వస్తున్న సినిమా కావడంతో ఎస్ఎస్ఎంబీ 28పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ మూవీని 2024 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ అప్డేట్ రావాల్సి ఉంది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజాహెగ్డే, శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. మహేశ్ బాబు ఈ ప్రాజెక్ట్ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో వరల్డ్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్గా రాబోయే ఎస్ఎస్ఎంబీ 29తో బిజీ కానున్నాడు.
Today is all the more special! This one's for you Nanna ❤️❤️❤️ pic.twitter.com/HEs9CpeWvY
— Mahesh Babu (@urstrulyMahesh) May 31, 2023
Also Read..
Al Pacino | 29 ఏళ్ల ప్రేయసితో.. నాలుగో బిడ్డకు తండ్రి కాబోతున్న 83 ఏళ్ల స్టార్ నటుడు
Mokshagna | గెట్ రెడీ నందమూరి ఫ్యాన్స్.. మోక్షజ్ఞ వచ్చేస్తున్నాడు..!
Kushi | టర్కీలో ‘ఖుషీ.. ఖుషీ’గా సమంత – విజయ్ దేవరకొండ.. పిక్స్ వైరల్