ఖైదీ సినిమాతో బాక్సాపీస్ ను షేక్ చేశాడు కోలీవుడ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్. ఈ చిత్రంతో అగ్ర నిర్మాతల దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం కమల్ హాసన్ తో విక్రమ్ సినిమాను చేస్తున్నాడు. లాక్డౌన్ పూర్తయి కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత విక్రమ్ను సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడు లోకేశ్. మేకర్స్ షూటింగ్స్, ప్రీ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేయాలని నిర్ణయించారట.
ఖైదీ చిత్రంలో విలన్ గా మెప్పించిన అర్జున్ దాస్ ను ఈ చిత్రంలో కీ రోల్ కు తీసుకోవాలని లోకేశ్ భావిస్తున్నాడని కోలీవుడ్ వర్గాల సమాచారం. లోకేశ్ డైరెక్ట్ చేసిన మాస్టర్ మూవీలో కూడా మెరిశాడు అర్జున్దాస్. ఒకవేళ అర్జున్ దాస్ ను తీసుకునేది ఫైనల్ అయితే లోకేశ్- అర్జున్ దాస్ కాంబినేషన్ ఇది మూడోసారి. మరోవైపు మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ కూడా ఈ ప్రాజెక్టులో ఉండబోతున్నాడు.
ఇవి కూడా చదవండి..
రవితేజ అవుట్..వరుణ్ తేజ్ ఇన్..!
అప్పుడు మిస్సయిన ఛాన్స్ మళ్లీ వచ్చింది..!
హీరో సుశాంత్ సింగ్ ప్రియురాలికి బిగ్ బాస్ ఆఫర్
విరాటపర్వం పై పుకార్లు..డైరెక్టర్ వేణు క్లారిటీ..!
మెగాస్టార్కి తమ్ముడిగా మరో మెగా హీరో..!
‘నేషనల్ క్రష్’ గా కన్నడ సోయగం..!
పెండ్లి పీటలెక్కిన బాలీవుడ్ నటి యామీగౌతమ్