స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) ఇటీవలే సినీ నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడని తెలిసిందే. ధోనీ-సాక్షి దంపతులు కలిసి ధోనీ ఎంటర్టైన్మెంట్ ను స్థాపించారు. కాగా ధోనీ త్వరలోనే నటుడిగా సిల్వర్ స్క్రీన్పై మెరువబోతున్నాడని ఓ వార్త టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. తమిళ సినిమాతో ధోనీ త్వరలోనే యాక్టింగ్ డెబ్యూ ఇవ్వనున్నాడని వార్తలు ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తున్నాయి.
ఖైదీ, విక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ఈ స్టార్ క్రికెటర్ను పరిచయం చేసేందుకు రెడీ అవుతున్నాడట. లోకేశ్ కనగరాజ్ స్టార్ హీరో విజయ్ (Vijay) సినిమాలో కీలక పాత్రతో ధోనీని ఇంట్రడ్యూస్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడని పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. దళపతి 67 (Thalapathy67 ) లో ఓ పాత్రకు ధోనీ అయితే సరిగ్గా సెటవుతాడని భావించిన లోకేశ్ కనగరాజ్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తుండగా.. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
ప్రస్తుతానికి ఈ వార్తలు అఫీషియల్ కాకున్నా తాజా అప్డేట్ను మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నారు సినీ జనాలు. ఒకవేళ ధోనీ ఎంట్రీ ఇస్తుంది నిజమే.. అయితే ఇంతకీ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడోనని అప్పుడే చర్చించుకోవడం మొదలుపెట్టారు మూవీ లవర్స్. ఇప్పటికే ఎంఎస్ ధోనీ బయోపిక్ ఎంఎస్ ధోనీ.. ది అన్టోల్డ్ స్టోరీ సిల్వర్ స్క్రీన్పై వచ్చిన విషయం తెలిసిందే.
సుశాంత్ సింగ్ రాజ్పుత్ లీడ్ రోల్లో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ధోనీ రానున్న రోజుల్లో సినిమాలు తెరకెక్కించడమే కాదు యాక్టింగ్తో కూడా బిజీగా మారేందుకు రెడీ అవుతున్నాడని తాజా వార్తలు చెబుతున్నాయి.
Read Also : Prema Desam trailer | మేఘా ఆకాశ్, త్రిగున్ ప్రేమదేశం ట్రైలర్
Read Also :టాలీవుడ్లో విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత
Read Also : Krishna | కృష్ణ ఆరోగ్యం నిలకడగా ఉంది : నరేశ్