దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు ఐదో వర్థంతిని పురస్కరించుకుని దాసరి స్మారక అవార్డుల కార్యక్రమం హైదరాబాద్లో నిర్వహించారు. భారత్ ఆర్ట్స్ అకాడెమీ, వాసవి ఫిల్మ్ అవార్డ్స్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
రచయిత యండమూరి వీరేంద్రనాథ్, రోజా రమణి చక్రపాణి దంపతులు, నటులు విజయ్ చందర్, సుమన్, దర్శకులు సాగర్, రాజా వన్నెంరెడ్డి తదితరులకు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా పురస్కార గ్రహీతలు దర్శకరత్న దాసరితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.