Lavanya Tripathi | శ్రీరామ జన్మభూమి అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం వైభవంగా జరిగింది. సోమవారం మధ్యాహ్నం దివ్య ముహూర్తాన బాలరాముడి విగ్రహాన్ని ప్రధాని మోదీ నూతనంగా నిర్మించిన రామాలయం గర్భగుడిలో ప్రతిష్టించారు. అనంతరం రామయ్యకు తొలి హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా దేశం మొత్తం రామ నామంతో మార్మోగిపోయింది. ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైన వేళ.. మెగా కోడలు, టాలీవుడ్ స్టార్ నటి లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi ) చేసిన ఆసక్తికర పోస్ట్ ఇప్పుడు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
లావణ్య జన్మస్థలం అయోధ్య అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు అక్కడ శతాబ్దాల కల సాకారమైనందుకు సంతోషం వ్యక్తం చేసింది. అయోధ్య వేడుక సందర్భంగా ఆమె సంప్రదాయ చీరకట్టుతోపాటు.. రామ్ పరివార్ డిజైన్ హారాన్ని (Ram parivar jewellery) ధరించింది. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘శ్రీరామ చంద్రుని దివ్య నివాసమైన అయోధ్యలో జన్మించినందుకు.. ఈ అద్భుతమైన ఘట్టాన్ని చూడటం అదృష్టంగా భావిస్తున్నా. భగవాన్ శ్రీ రాముని ప్రాణ ప్రతిష్టను చూడటం భారతీయులుగా మనకు గర్వకారణం. ఇలాంటి శుభ సందర్భంలో రామ్ పరివార్ నగలు ధరించడం చాలా సంతోషంగా ఉంది. ఈ వేడుక కేవలం అయోధ్యకు మాత్రమే కాదు.. మొత్తం దేశానికి ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ కార్యక్రమం మనందరినీ ఏకం చేసే క్షణం’ అంటూ రాసుకొచ్చింది. ప్రాణ ప్రతిష్ట వేళ మెగా కోడలు చేసిన ఈ పోస్ట్ తెగ ఆకట్టుకుంటోంది.
Also Read..
Kangana Ranaut Video| రామ్ ఆగయే.. జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించిన కంగన రనౌత్
PM Modi | సాధువుల ఆశీర్వాదం తీసుకుని.. కానుకలను స్వీకరించిన ప్రధాని మోదీ
Ram Lalla | గర్భగుడిలో పూజలందుకుంటున్న బాలరాముడు.. తొలి విజువల్స్