PM Modi | వందల ఏళ్ల నాటి కలను సాకారం చేస్తూ అయోధ్యాపురిలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. శ్రీ రామ జన్మభూమి (Shri Ram Janmaboomi Temple)లో నూతనంగా నిర్మించిన రామాలయంలో బాలరాముడు కొలువుదీరాడు. రామ్లల్లా ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi ) శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం గర్భగుడిలో కొలువుదీరిన బాలరాముడికి తొలి హారతి ఇచ్చారు. కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ సాధువుల (sadhus) ఆశీర్వాదం తీసుకున్నారు. వారి నుంచి పలు కానుకలను కూడా స్వీకరించారు.
ప్రతిష్టాపన కార్యక్రమం పూర్తైన తర్వాత వేడుకలకు హాజరైన సాధువుల వద్దకు వెళ్లిన మోదీ.. వారి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. సాధువులు సైతం మోదీని హత్తుకుని అభినందనలు తెలిపారు. అనంతరం వారి నుంచి ప్రధాని కానుకలు కూడా స్వీకరించారు.
#WATCH | PM Narendra Modi takes blessings from ‘sadhus’ at the Shri Ram Janmaboomi Temple in Ayodhya.
#RamMandirPranPrathistha pic.twitter.com/rgVHDQzIAi
— ANI (@ANI) January 22, 2024
Also Read..
Ram Lalla | గర్భగుడిలో పూజలందుకుంటున్న బాలరాముడు.. తొలి విజువల్స్
Pran Pratishtha | అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్టాపన పూజ ప్రారంభం.. పాల్గొన్న ప్రధాని మోదీ.. LIVE
Pran Pratishtha | ప్రాణప్రతిష్టకు దివ్య ముహూర్తం.. 84 సెకండ్లు మాత్రమే