ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారిన అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి. ఉప్పెన చిత్రంతో కృతి పలు సినిమా ఆఫర్స్ పొందడమే కాదు అశేష ప్రేక్షకదారణ దక్కించుకుంది. ఈ అమ్మడితో ముచ్చటించేందుకు అభిమానులు తెగ ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో కృతి వీలున్నప్పుడల్లా తన సోషల్ మీడియా ద్వారా నెటిజన్స్తో ముచ్చటిస్తూ ఉంటుంది. తాజాగా కొందరు అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చింది.
ఓ నెటిజన్ మీరు మాట్లాడే తెలుగు చాలా బాగుంటుంది. రానున్న సినిమాల్లో ఓన్ డబ్బింగ్ చెప్తారా..?’ అని అడిగాడు. దానికి సమాధానంగా కృతిశెట్టి.. ‘నాకు కూడా ఓన్ డబ్బింగ్ చెప్పాలనే ఉంది. చూడాలి ఏం జరుగుతుందో అని బదులిచ్చింది. ఇక అబ్బాయిల్లో మీకు నచ్చని విషయం ఏంటని అడగ్గా.. అబద్దం చెప్పేవారంటే అసహ్యమని చెప్పింది. అది అబ్బాయిలైన, అమ్మాయిలైన అని పేర్కొంది. ముక్కు సూటిగా మాట్లాడే వారిని నేను ఎక్కువగా ఇష్టపడతానని పేర్కొంది బేబమ్మ. కాగా ఈ అమ్మడు ప్రస్తుతం నాని హీరోగా వస్తోన్న ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. దీనితో పాటు సుధీర్బాబుతో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, రామ్ పోతినేనితో ఓ సినిమాలో కథానాయికగా నటస్తుంది కృతి.