శ్రీకాంత్ మేక, వరలక్ష్మి శరత్కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. ఈ చిత్రం ఫస్ట్లుక్ పోస్టర్ను ఇటీవల విడుదల చేసింది చిత్రబృందం. తేజ మార్ని దర్శకత్వంలో బన్నీ వాసు, విద్యా కొప్పినీడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ ‘రాజకీయాలు, పోలీసుల మధ్య జరిగే కథ ఇది. ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా వుంటుంది. చిత్ర టైటిల్ కూడా అందరిలోనూ క్యూరియాసిటీని పెంచుతుంది.కొత్తదనంతో కూడిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతున్నాను’ అన్నారు. ఈ చిత్రానికి సంభాషణలు: నాగేంద్ర కాశి, సంగీతం: రంజిన్రాజ్, మిధున్ ముకుందన్.