టాలీవుడ్ (Tollywood) స్టార్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) ప్రస్తుతం ఆచార్య ( Acharya) రిలీజ్ కోసం ఎక్జయిటింగ్గా ఎదురుచూస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న ఈ మూవీ ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఆచార్య ప్రమోషన్స్ లో పాల్గొంటున్న కొరటాలకు తరచూ ఓ ప్రశ్న ఎదురవుతూనే ఉంది. ఇంతకీ ఆ ప్రశ్నేంటో మూవీ లవర్స్ కు అర్థమయ్యే ఉంటుంది. కొరటాల నెక్ట్స్ చేయబోయే ఎన్టీఆర్ 30 (NTR 30) ప్రాజెక్టు గురించే ఓ ఈవెంట్లో చూసినా ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
అయితే కొరటాల మాత్రం నొప్పించక తానొవ్వక అన్నట్టుగా తారక్ తో చేస్తున్న సినిమా గురించి మరో సందర్భంలో మాట్లాడుతానని అంటున్నాడు. రిపోర్టర్స్ పదే పదే ప్రశ్నించడం, తారక్ చేయబోతున్న సినిమా పొలిటికల్బ్యాక్ డ్రాప్ (Political drama) లో ఉంటుందని వార్తలు వస్తుండటంతో ఫైనల్ గా క్లారిటీ ఇచ్చాడు కొరటాల. ఎన్టీఆర్ తో చేయనున్న సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో ఉండదని చెప్పేశాడు.
‘అలాంటి పుకార్లలో వాస్తవం లేదు. ఎన్టీఆర్ 30 డిఫరెంట్ బ్యాక్డ్రాప్లో అద్బుతంగా ఉండబోతుంది. కథ పరిధి చాలా పెద్దగా ఉంటుంది. నా కెరీర్లో రాయని అతి పెద్ద కథ ఇది. సినిమా కంటెంట్ చూసిన తర్వాత మీరు షాకవడం గ్యారంటీ..’అన్నాడు కొరటాల.
ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయని చెప్తూనే..హీరోయిన్, ఇతర వివరాల గురించి చెప్పేందుకు నో అన్నాడు కొరటాల. అదేవిధంగా పవన్ కల్యాణ్ (Pawan Kalyan)కోసం కథ చేశానని మరో క్రేజీ అప్ డేట్ అందించాడు. అంతేకాదు మిర్చి హీరో ప్రభాస్తో టచ్లో ఉన్నానని, రాంచరణ్ తో త్వరలో ఎప్పుడైనా పనిచేయొచ్చని క్లారిటీ ఇచ్చేశాడు.
Read Also : Hombale Films | కొత్త సినిమాతో కేజీఎఫ్ మేకర్స్ సర్ప్రైజ్..ఎంట్రీ లుక్ వైరల్
Read Also : Major Release date | మేజర్ కొత్త విడుదల తేదీ ఫైనల్..షేర్ చేసిన మహేశ్ బాబు
Read Also : Nandamuri Balakrishna | ఆస్పత్రిలో బాలకృష్ణ..పుకార్లపై పీఆర్ టీం క్లారిటీ
Read Also : Kiara Advani post | బ్రేకప్ వార్తల మధ్య టాక్ ఆఫ్ ది టౌన్గా కియారా తాజా పోస్ట్