Kiara Advani | గతకొంత కాలంగా బాలీవుడ్ మీడియా కోడై కూస్తున్న కియరా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రాల పెళ్ళి ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. ఫిబ్రవరి 6న వీరిద్ధరూ మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానున్నారు. వీరి పెళ్లికి రాజస్థాన్ జైసల్మేర్లోని సూర్యగ్రహ్ ప్యాలేస్ వేదిక కానుంది. పంజాబీ సంప్రదాయంలో వీరిపెళ్లిని అంగరంగా వైభవంగా జరిపే విధంగా ఇరు కుటుంబ సభ్యులు ప్యాలేస్ను అలకరిస్తున్నారు. ఇప్పటికే పెళ్లి పనులు కూడా దాదాపు పూర్తయినట్లు వినికిడి. కాగా తాజాగా కియారా అద్వానీ తన కుటుంబంతో కలిసి జైసల్మేర్కు బయలుదేరింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఫిబ్రవరి 4,5 తేదిల్లో మెహెందీ, హల్దీ ఫంక్షన్లు జరుగనున్నాయి. ఇక వీరి పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులతో పాటు బాలీవుడ్కు చెందిన పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. ఇక టాలీవుడ్లోని కొందరు ప్రముఖులకు కూడా ఆహ్వానం అందినట్లు తెలుస్తుంది.పెళ్లి అనంతరం ఢిల్లీ, ముంబైలలో వివాహ రిసెప్షన్లను గ్రాండ్గా ఏర్పాటు చేయనున్నట్లు టాక్. వీరిద్ధరూ మొదటి సారి ‘షేర్షా’ సినిమాలో కలిసి నటించారు. ఇక షూటింగ్ టైమ్లో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఇదే విషయాన్ని వీరిరువురూ పలు సందర్భాల్లో స్ట్రేయిగ్గా చెప్పకపోయినా.. హింట్ లాంటివి ఇచ్చారు.
#KiaraAdvani and #SidharthMalhotra’s wedding: Bride-to-be @advani_kiara jets off to Jaisalmer for her wedding. Their pre-wedding functions will happen on February 4th and 5th and the wedding will take place on the 6th.😍😍😍#SidKiaraWedding @SidMalhotra pic.twitter.com/mdgzwgJLRy
— ETimes (@etimes) February 4, 2023