సినీ రంగంలో పారితోషికాల విషయంలో కథానాయికలు వివక్షకు గురవుతున్నారనే చర్చ ఎప్పటి నుంచో నడుస్తున్నది. హీరోలతో పోల్చితే నాయికలకు చాలా తక్కువ మొత్తంలో రెమ్యునరేషన్ దక్కుతుంది. ఈ విషయం గురించి అగ్ర కథానాయిక కియారా అద్వాణీ మాట్లాడుతూ ‘పారితోషికాల్లో వివక్ష గురించిన చర్చ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.
మన ప్రతిభ ఆధారంగానే రెమ్యునరేషన్స్ను నిర్ణయిస్తారు. హీరోయిన్ల ఛరిష్మా సినిమాకు ఎంత మేరకు ఉపయోగ పడుతుంది? ప్రేక్షకుల్ని వారు ఏ స్థాయిలో ఆకర్షించగలరు? అనే అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. అందుకే పారితోషికాల గురించి ఆలోచించకుండా ప్రతిభకు మెరుగులుదిద్దుకోవాలి. మన టాలెంట్కు ఎవరు ఎక్కువ విలువనిస్తారో వారి కంపెనీలో ఉండేందుకు ప్రయత్నం చేయాలి. అప్పుడు పారితోషికాల గురించి ఆలోచించాల్సిన అవసరమే ఉండదు’ అని చెప్పుకొచ్చింది. సిద్ధార్థ మల్హోత్రాతో వివాహానంతరం సినిమాలకు కాస్త బ్రేక్నిచ్చిన కియారా అద్వాణీ ప్రస్తుతం బాలీవుడ్లో వరుస సినిమాలో బిజీగా మారింది.