Keerthisuresh | నేషనల్ అవార్డు గ్రహిత కీర్తి సురేష్ను ప్రస్తుతం వరుసగా ఫ్లాప్లు వెంటపడుతున్నాయి. ఎంచుకునే కథలు బాగానే ఉన్నా అవుట్పుట్ సరిగ్గా లేక పోవడంతో కీర్తి నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పరాజయం పాలవుతున్నాయి. ప్రస్తుతం ఈమె ‘సర్కారు వారి పాట’ సినిమాలో మహేష్బాబుకు జోడిగా నటిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ను జరుపుకుంటున్న ఈ చిత్రం మే 12న విడుదల కానుంది. దీంతో పాటుగా ‘వాశి’ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్లుక్ పోస్టర్ను మహేష్బాబు, సమంత సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.
టోవినో థామస్, కీర్తిసురేష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న వాశి చిత్రాన్ని విష్ణు జీ రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నాడు. రేవతి కళామందిర్, ఊర్వశి థియేటర్స్ బ్యానర్లపై సురేష్ కుమార్, మేనకసురేష్, రేవతి సురేష్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర పోస్టర్ను తెలుగులో మహష్బాబు, సమంత విడుదల చేశారు. ఈ చిత్రంలో కీర్తిసురేష్, టోవినో థామస్లు ఇద్దరూ లాయర్లుగా కనిపించనున్నారు.ఈ చిత్ర పోస్టర్ను హిందీలో అభిషేక్ బచ్చన్ విడుదల చేయగా, తమిళంలో ఏఆర్ రెహామాన్, త్రిష విడుదల చేశారు. మలయాళంలో మోహన్లాల్, మంజు వారియర్ విడుదల చేశారు.టోవినో తాజాగా ‘మిన్నల్ మురళి’తో సూపర్ హిట్ను అందుకున్నాడు. ప్రస్తుతం ఈయన నటించిన ‘నార్దన్’ మార్చి 3న విడుదల కానుంది.
Here's the first look of Malayalam film #Vaashi!! Best wishes to @KeerthyOfficial @ttovino @vishnugraghav and the entire team! Looking forward to this one! pic.twitter.com/RVThxGLFLD
— Mahesh Babu (@urstrulyMahesh) February 19, 2022