టాలీవుడ్ యాక్టర్ నిఖిల్ సిద్దార్థ్, కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) కాంబినేషన్లో వచ్చిన మిస్టరీ థ్రిల్లర్ కార్తికేయ 2 (Karthikeya 2). చందూ మొండేటి (Chandoo Mondeti) డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఆగస్టు 13న థియేటర్లలో గ్రాండ్గా విడుదలైంది. కాగా ఈ చిత్రం తొలి రోజు నుంచి మంచి టాక్తో స్క్రీనింగ్ అవుతూ నిఖిల్ టీంలో జోష్ నింపుతోంది. తాజాగా నైజాం ఏరియాలో ఓపెనింగ్ డేన రాబట్టిన కలెక్షన్లపై ఓ అప్డేట్ ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
లేటెస్ట్ టాక్ ప్రకారం నైజాంలో రూ.1.2 కోట్లు (జీఎస్టీతో కలిపి) రాబట్టింది. ఇది నిఖిల్ కెరీర్లోనే టాప్. గుడ్ టాక్ ఉండటంతో ఈ చిత్రం ఆదివారం కూడా మంచి కలెక్షన్లు రాబడుతుందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలుగుతోపాటు వివిధ భాషల్లో విడుదలైన కార్తికేయ 2 మరి రానున్న రోజుల్లో ఏ రేంజ్లో వసూళ్లను రాబడుతుందో చూడాలంటున్నారు సినీ విశ్లేషకులు.
కార్తికేయ 2లో శ్రీనివాస్ రెడ్డి, బాలీవుడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ అనుపమ్ఖేర్, ఆదిత్యా మీనన్, హర్ష చెముడు కీలక పాత్రల్లో నటిచంగా..కాలభైరవ మ్యూజిక్ అందించాడు.ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు.
Read Also : Mahesh Stylish look | మహేశ్ బాబు కొత్త లుక్..ఆ సినిమా కోసమేనా..!
Read Also : Tiger Shroff | క్రేజీ టాక్..మరో భామతో డేటింగ్లో యువ హీరో..!