Parineeti Chopra | ఆప్ ఎంపీ (AAP MP) రాఘవ్ చద్దా (Raghav Chadha) తో బాలీవుడ్ స్టార్ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra) ఎంగేజ్మెంట్ (engagement) శనివారం ఢిల్లీ (Delhi) లో జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుక కోసం అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తైనట్లు సమాచారం. నిశ్చితార్థ వేడుకకు 150 మంది అతిథులు హాజరవ్వనున్నారు. అయితే తాజాగా ఈ వేడుకకు హాజరయ్యే ప్రముఖుల లిస్ట్లోని కొన్ని పేర్లు ప్రస్తుతం న్యూస్ సర్కిల్లో తెగ వైరల్ అవుతున్నాయి.
ఆ వార్తల ప్రకారం.. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా (Sania Mirza), ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్ర, కరణ్ జోహార్ వంటి స్టార్స్ ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పరిణీతి సోదరి ప్రియాంక (Priyanka Chopra) కూడా ఎంగేజ్మెంట్ వేడుకకు హాజరవుతారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
‘రేపు ఢిల్లీలో రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రాల నిశ్చితార్థం జరగనుంది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం ఈ జంట ప్రత్యేకంగా పార్టీని ప్లాన్ చేసింది. ఈ రోజు రాత్రి నుంచే వేడుకలు ప్రారంభమవుతాయి. వచ్చిన అతిథులు ఆనందంగా గడిపేందుకు కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రేపటి ఎంగేజ్మెంట్ వేడుకకు పరిణీతి సోదరులు అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటున్నారు. పరిణీతి స్నేహితులు రేపు ఉదయం ఢిల్లీకి చేరుకుంటారు. ఆమె సన్నిహితులు సానియా మీర్జా, కరణ్ జోహార్, మనీష్ మల్హోత్ర అతిథుల జాబితాలో ఉన్నారు’ అని వీరిద్దరికీ దగ్గర వ్యక్తి ఒకరు తెలిపారు.
ఇక ఈ వేడుకకు పరిణీతి సోదరి ప్రియాంక కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ‘ప్రస్తుతం ప్రియాంక హాలీవుడ్లో సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉంది. అయితే రాఘవ్ – పరిణీతిల ఎంగేజ్మెంట్ కోసం రెండు రోజులు తన బిజీ షెడ్యూల్ నుంచి విరామం తీసుకుని ఇండియా వస్తారు. నిక్ జొనాస్, కుమార్తె మల్తీ.. ప్రియాంకతో కలిసి భారత్ వస్తారో లేదో ఇంకా తెలియదు’ అని వారు వివరించారు. కాగా, ఈ ఏడాది అక్టోబర్ చివర్లో వీరు వివాహం చేసుకునే అవకాశం ఉంది.
Also Read..
Viral News | బొమ్మ కారు కొనేందుకు అసలు కారు నడుపుకుంటూ వెళ్లిన చిన్నారులు.. చివరకు ఏమైందంటే..?
Imran Khan | జైల్లోనే ఇమ్రాన్ హత్యకు కుట్ర.. గుండెపోటు వచ్చేలా ఇంజెక్షన్లు ఇచ్చారు : న్యాయవాదులు